మనవార్తలు,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఐవోటీ యూజింగ్ పెథాన్ ‘ అనే అంశంపై ఈనెల 16-18వ తేదీలలో మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎఫ్ఎపీ ) నిర్వహించనున్నారు . గీతం డెరైక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ ప్రణయనాథ్ రెడ్డి , డాక్టర్ దీపక్ ఎన్ . బిరాదర్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . భౌతిక పరికరాలు , సాఫ్ట్వేర్లు , సెన్సార్లు , నెట్వర్క్ కనెక్టివిటీల ఇంటర్ – నెట్వర్కింగ్ను కలిగి ఉన్న ఐవోటీ ప్రాజెక్టులను నిర్వహించడంపై ఈ అధ్యాపక వికాస కార్యక్రమం దృష్టి సారించనున్నట్టు వారు తెలియజేశారు .
డేటాను సేకరించడానికి , మార్పిడి చేయడాన్ని కూడా అనుమతిస్తామన్నారు . ఈ మూడు రోజుల ఆచరణాత్మక సాధనలో పాల్గొనే అధ్యాపకులకు అంతర్జాతీయ సామర్థ్యాలతో పాటు నెపుణ్యాలను కూడా పొందవచ్చని తెలిపారు . ప్రయోగాల ద్వారా సంపూర్ణ అవగాహన ఏర్పరచుకునేలా హార్డ్వేర్ పరికరాలను అందిస్తామని , ఇందులో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలను కూడా పంపిణీ చేస్తామని చెప్పారు .
ఈ ఎఫీపీలో ఆర్డినో ఆర్కిటెక్చర్ , ప్రోగ్రామింగ్ , నోడ్ ఎంసీయూ , ప్రాథమిక ఐవోటీ ప్రాజెక్టులతో పనిచేయడం , సెన్సార్ ఇంటర్ఫేస్ , ఓపెన్ – సోర్స్ క్లౌడ్ , క్లౌడ్ వెపు డేటా లాగింగ్ వంటి అంశాల గురించి అవగాహన ఏర్పరచుకోవచ్చని తెలిపారు . ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ ప్రణయనాథరెడ్డి 90108 43555 ని సంప్రదించాలని , లేదా https://forms.gle/NjKYCiFc1t7MNXW7 కు లాగిన్ అవ్వాలని సూచించారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…