politics

విద్యార్థికి బాసటగా నిలిచినా _ఎండిఆర్ ఫౌండేషన్

మన వార్తలు ,పటాన్‌చెరు:

ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ చేయూతనందించి.మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు  విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డికి 20 వేల రూపాయలు సహాయం అందజేశారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన విద్యార్థి పటాన్ చెరులో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. అతనికి ఎల్లంకి కళాశాలలో బీటెక్ లో సీటు వచ్చింది. కానీ పేదరికం కారణంగా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా ఆయన సహాయం చేయాలంటూ ఎండిఆర్ ఫౌండేషన్ ను సంప్రదించారు. దీంతో అతని ఫీజు నిమిత్తం 20,000 రూపాయలను అందించారు.

అనంతరం మాట్లాడుతూ దేవేందర్ రాజు మట్టిలో మాణిక్యం లాంటి అనేకమంది పేదలు ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతున్నారు  మంచి మనసుతో ఇలాంటి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని, చరిత్రలో అనేక మంది పేద వర్గాల నుండి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించారని ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గుర్తుచేశారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా శ్రద్ధతో చదివి మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

 

Ramesh

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

20 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

20 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

20 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

20 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago