మన వార్తలు ,పటాన్చెరు:
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ చేయూతనందించి.మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డికి 20 వేల రూపాయలు సహాయం అందజేశారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన విద్యార్థి పటాన్ చెరులో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. అతనికి ఎల్లంకి కళాశాలలో బీటెక్ లో సీటు వచ్చింది. కానీ పేదరికం కారణంగా ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా ఆయన సహాయం చేయాలంటూ ఎండిఆర్ ఫౌండేషన్ ను సంప్రదించారు. దీంతో అతని ఫీజు నిమిత్తం 20,000 రూపాయలను అందించారు.
అనంతరం మాట్లాడుతూ దేవేందర్ రాజు మట్టిలో మాణిక్యం లాంటి అనేకమంది పేదలు ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతున్నారు మంచి మనసుతో ఇలాంటి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని, చరిత్రలో అనేక మంది పేద వర్గాల నుండి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించారని ఎండిఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గుర్తుచేశారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా శ్రద్ధతో చదివి మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…