_బొల్లారంలో వైభవంగా భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
_పూర్ణకుంభంతో నీలం మధుకు ఘన స్వాగతం పలికిన అర్చకులు
మనవార్తలు ,బొల్లారం:
ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడు భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవం వేంకటేశ్వరుడు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
బుధవారం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సుజాతమహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకుంటే పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడిని జయించవచ్చన్నారు. వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడని, ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, కార్మిక సంఘం నాయకులు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు తలారి కృష్ణ,శంకర్, రాజ్ గోపాల్,ధర్మ రావు,బాలరాజు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…