Telangana

గణితం ఓ ఆలోచనా విధానం , సార్వత్రిక భాష…

– జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో ట్రిబుల్ ఐటీ ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గణితశాస్త్రం కేవలం సెన్స్డ్ ఒక విభాగం కాదని , ఇది ఓ ఆలోచనా విధానమని , ఇదో తత్వశాస్త్రం , సార్వత్రిక భాష , ప్రకృతి భాషగా ట్రిబుల్ ఐటీ కర్నూలు ప్రొఫెసర్ జి . రాధాకృష్ణమాచార్య అభివర్ణించారు . ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అందించిన సేవలపై అవగాహన కల్పించడానికి , గీతం హెద్దరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సెన్ట్స్ , గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య మాట్లాడుతూ , శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు , గణిత శాస్త్రం విశిష్టతలను గురించి చెప్పారు . మనం ప్రకృతిలో ఏది గమనించినా , వాటిని వివరించడానికి గణితంలో ఒక భావన ఉంటుందని , అందుకే గణితం ప్రకృతి భాష అన్నారు .

గణితం అనేది సెన్స్ అండ్ టెక్నాలజీ భాష అని , అది టెక్నాలజీకి గుండె , ఆత్మ వంటిదిగా ఆయన అభివర్ణించారు . శాస్త్ర , సాంకేతిక ఆవిష్కరణలకు గణితమే ఆధారమని , గణిత శాస్త్రంలో పట్టు సాధిస్తే , ఏ రంగంలోనయినా మరింత సామర్థ్యంతో పనిచేయగలమని డాక్టర్ రాధాకృష్ణమాచార్య పేర్కొన్నారు . శాస్త్ర , సాంకేతిక రంగాలలోని అన్ని విభాగాల వారు గణితం ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆయన సూచించారు . గణితాన్ని సరైన దృక్కోణంలో అర్థం చేసుకుంటే , అదే శ్రీనివాస రామానుజన్కు మనం అర్పించే నిజమైన నివాళన్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేషా సభాధ్యత వహించగా , ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ అతిథిని పరిచయం చేశారు . ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు ముఖ్య అతిథిని సత్కరించారు . గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త కె.కృష్ణ వందన సమర్పణ చేశారు .

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు . ఫజిల్ పోటీలలో వి.సిద్ధార్థ యాదవ్ , వీఎస్ఎం శ్రీకర్ , అనీషాలు బహుమతులను గెలుచుకోగా , పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరిప్రియ లక్ష్మి , పీబీఎస్ఎం సందీప్ , కావ్యశ్రీలు విజేతలుగా నిలిచారు . వారందరికీ ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago