Telangana

గణితం ఓ ఆలోచనా విధానం , సార్వత్రిక భాష…

– జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో ట్రిబుల్ ఐటీ ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గణితశాస్త్రం కేవలం సెన్స్డ్ ఒక విభాగం కాదని , ఇది ఓ ఆలోచనా విధానమని , ఇదో తత్వశాస్త్రం , సార్వత్రిక భాష , ప్రకృతి భాషగా ట్రిబుల్ ఐటీ కర్నూలు ప్రొఫెసర్ జి . రాధాకృష్ణమాచార్య అభివర్ణించారు . ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అందించిన సేవలపై అవగాహన కల్పించడానికి , గీతం హెద్దరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సెన్ట్స్ , గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య మాట్లాడుతూ , శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు , గణిత శాస్త్రం విశిష్టతలను గురించి చెప్పారు . మనం ప్రకృతిలో ఏది గమనించినా , వాటిని వివరించడానికి గణితంలో ఒక భావన ఉంటుందని , అందుకే గణితం ప్రకృతి భాష అన్నారు .

గణితం అనేది సెన్స్ అండ్ టెక్నాలజీ భాష అని , అది టెక్నాలజీకి గుండె , ఆత్మ వంటిదిగా ఆయన అభివర్ణించారు . శాస్త్ర , సాంకేతిక ఆవిష్కరణలకు గణితమే ఆధారమని , గణిత శాస్త్రంలో పట్టు సాధిస్తే , ఏ రంగంలోనయినా మరింత సామర్థ్యంతో పనిచేయగలమని డాక్టర్ రాధాకృష్ణమాచార్య పేర్కొన్నారు . శాస్త్ర , సాంకేతిక రంగాలలోని అన్ని విభాగాల వారు గణితం ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆయన సూచించారు . గణితాన్ని సరైన దృక్కోణంలో అర్థం చేసుకుంటే , అదే శ్రీనివాస రామానుజన్కు మనం అర్పించే నిజమైన నివాళన్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేషా సభాధ్యత వహించగా , ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ అతిథిని పరిచయం చేశారు . ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు ముఖ్య అతిథిని సత్కరించారు . గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త కె.కృష్ణ వందన సమర్పణ చేశారు .

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన దాదాపు 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు . ఫజిల్ పోటీలలో వి.సిద్ధార్థ యాదవ్ , వీఎస్ఎం శ్రీకర్ , అనీషాలు బహుమతులను గెలుచుకోగా , పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరిప్రియ లక్ష్మి , పీబీఎస్ఎం సందీప్ , కావ్యశ్రీలు విజేతలుగా నిలిచారు . వారందరికీ ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

5 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

5 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

5 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago