Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

_వివాహ వేదిక: జిఎంఆర్ ఫంక్షన్ హాల్

_వివాహాల తేదీ: మే 7, 2023

_నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి..

_త్వరలోనే ముస్లిం, క్రిస్టియన్ల సామూహిక వివాహాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దాతృత్వానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో సామూహిక వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామూహిక వివాహాల కార్యక్రమ వివరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ వెల్లడించారు.పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా తమ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, వేద బ్రాహ్మణులతో చర్చించిన అనంతరం మే 7వ తేదీ, ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో సంప్రదాయబద్ధంగా సామూహిక వివాహాలు జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

మొదటగా హిందువుల సామూహిక వివాహాలు జరిపించిన అనంతరం, ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలతో చర్చించి వారికి సంబంధించిన సామూహిక వివాహాల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.దీనికోసం అర్హులైన హిందువుల జంటలు తమ తమ మండలాల పరిధిలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకుని రసీదులు పొందాలని సూచించారు.సామూహిక వివాహాల్లో వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు వర్తింప చేస్తామని పేర్కొన్నారు.గతంలో తాను ఎంపీపీగా పని చేసినప్పుడు 20 జంటలకు సామూహిక వివాహాలు జరిపించినట్లు గుర్తు చేశారు.మానవసేవయే మాధవసేవ అన్న నానుడికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

20 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

20 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

20 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago