Telangana

మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి

_సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి పాండురంగారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మణిపూర్ రాష్ట్ర ముఖ్య మంత్రి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ అధ్వర్యంలో పట్టణంలోని జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మే నెలలో మహిళలను నగ్నంగా ఊరేగించి న ఘటనలో దుండగులనువెంటేనే కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారని అన్నారు.మణిపూర్ లో మహిళల పై జరుగుతున్న దాడుల విషయం లో సమాజం తల దించు కోవలసి వస్తుందని అన్నారు.దీనికి కారణం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వాల దే బాధ్యత అన్నారు.మణిపూర్ రాష్ట్ర ముఖ్య మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దేశంలో మహిళలకు రక్షణ కల్పించే విషయంలో బి జె పి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు.

తెగల మద్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని కేంద్రం చూస్తుందని మండిపడ్డారు.ఇంత జరిగిన పార్లమెంట్ లో చర్చించడానికి ప్రధాన మంత్రి సిద్దంగా లేకపోవడం అత్యంత దారుణమన్నారు.ప్రశాంత మైన వాతావరణం వున్న మణిపూర్ రాష్ట్రంలో గత 2 నెలలుగా గొడవలు జరుగుతున్న శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అదని విమర్శించారు.మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి దోషులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనిపక్షంలో మణిపూర్ ప్రజలకు అండగా దేశ వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్య క్రమం లో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్ నర్సింహారెడ్డి,ఊపాదక్షులు బి నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు సుధాకర్,బి పాండురంగా రెడ్డి,శ్రీనివాస్,వెంకటేష్,కిరణ్,రాంచందర్, మనిరాజు,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago