_దోమడుగు లో కరెంట్ షాక్ తో ఐదు బర్రెలు మృతి
_ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేత
మనవార్తలు ,గుమ్మడిదల
పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన బొంది సంజీవ కు చెందిన ఆరు బర్రెలు సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుదాఘాతానికి గురయ్యాయి. వీటిలో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి ఆధారమైన బర్రెలు మృతి చెందటంతో సంజీవ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలిపారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళవారం ఉదయం జడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, స్థానిక నాయకుల సమక్షంలో రైతు కుటుంబానికి ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…