బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం :
సమాజంలో అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని, ఆయన సూచించిన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బీరంగూడ చౌరస్తాలో గల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే కులం మతం వర్ణ వివక్షత లేని సమాజం కోసం అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి, అన్ని మతాలు ఒక్కటేనని, మనుషులందరూ సమానమేనని చాటిచెప్పిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వరుడని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతో.. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంకు బండ్ పైన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో బీరంగూడలో 12 అడుగుల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరశైన లింగాయత్ సమాజం నియోజకవర్గం అధ్యక్షులు జగదీష్, సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…