మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
భవిష్యత్ తరాలకు స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దామని కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి అన్నారు.గ్రీన్ డే పురస్కరించుకొని మంగళవారం పటాన్ చెరు పట్టణం లోని సీతారామపురం కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు అచ్చి ఆధ్వర్యంలో గ్రీన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పాఠశాల ప్రాంగణాన్ని ఆకుపచ్చ రంగులతో బెలూన్లు, మొక్కలు, పర్యావరణ సందేశాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉత్సాహంగా గ్రీన్ డే వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు అచ్చి మాట్లాడుతూ”ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నప్పటి నుంచే పిల్లల్లో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో స్వచ్ఛమైన, హరిత సమాజాన్ని నిర్మించగలుగుతామన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పాటలు, నృత్యాలు, సందేశాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: రానున్న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ దేశవ్యాప్తంగా ఆగస్టు 10న…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అజైలియు నియుమై మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పేదరికం, నిరుద్యోగం, లింగ అసమానత,…
ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించండి ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో పరిశ్రమల భాగ్యస్వామ్యం మరింత పెరగాలి బాల వికాస ఫౌండేషన్…
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు, గుమ్మడిదల మండల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ…