మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
రానున్న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో వేడుకలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే సంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి పాఠశాలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతి తో పాటు, ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన పాఠశాలలకు 20 వేలు, 15 వేలు, 10 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర ఘట్టాలను, సంస్కృతిని మరిపించేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భవిష్యత్ తరాలకు స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దామని కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి అన్నారు.గ్రీన్ డే…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ దేశవ్యాప్తంగా ఆగస్టు 10న…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అజైలియు నియుమై మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పేదరికం, నిరుద్యోగం, లింగ అసమానత,…
ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించండి ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో పరిశ్రమల భాగ్యస్వామ్యం మరింత పెరగాలి బాల వికాస ఫౌండేషన్…
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయండి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు, గుమ్మడిదల మండల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ…