Telangana

చెత్తను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం…

– వ్యర్థాల నిర్వహణపై రేవతి మాచర్ల సూచన

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మన ఇళ్ళలో వచ్చే వ్యర్థాలలో తొంభై శాతం పునర్వినియోగించవచ్చని , తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని బయో – ఎంజెమ్స్ నిపుణురాలు , ప్రకృతి ప్రేమికురాలు రేవతి మాచర్ల సూచించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వంట చేసే సిబ్బంది , పారిశుధ్య పనివారితో మంగళవారం ఆమె ముఖాముఖి నిర్వహించారు . మనం ప్రతి నిత్యం వంట గదిలో ఎన్నో కాయగూరల తొక్క వలుస్తామని , వాటిని వృథాగా పడేయకుండా 600 గ్రాముల తొక్కలకు 200 గ్రాముల బెల్లం , రెండు లీటర్ల నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్లో భద్రపరచుకోవాలని , అందులో కొంత బయో ఎంజె చేర్చితే 30 రోజుల్లోనే మనకు ఉపకరించే పదార్థం తయారవుతుందని చెప్పారు . అది మొక్కలకు వేస్తే చాలా మంచి జరుగుతుందన్నారు . అలాగే 300 గ్రాముల లెమన్ గ్రాస్ , వంద గ్రాముల బెల్లం , లీటరు నీటిలో కొద్దిగా ఎంజెమ్ చేర్చితే ఇళ్లు శుభ్రపరచుకునే పదార్థం తయారవుతుందన్నారు . వేపాకులో బెల్లం , నీరు , కొంత ఎంజెమ్ వేస్తే నీమ్ ఎంజెమ్ వస్తుందని చెప్పారు .

అలాగే గులాబీ పూలు , తులసి ఆకులతో కూడా ఎంజెలు తయారుచేసి ఫేస్ ప్యాక్లుగా వినియోగించుకోవచ్చన్నారు . అయితే వీటికి ఎండ తగల కూడదని , అందులో ఉత్పత్తి అయ్యే వాయువు బయటకు పోయేలా మధ్యమధ్యలో మూత తీసి మళ్లీ బిగించాలని సూచించారు . మిగిలిపోయిన అన్నం , బియ్యపు / శనగ పిండిలో రోజ్ ఎంజెమ్ కలుపుకుని ముఖానికి రాసుకుంటే బాగా నునుపుదేలి మెరుస్తుందన్నారు . ఇవన్నీ చేయడం ద్వారా దాదాపు 90 శాతం చెత్తను సద్వినియోగం చేయడంతో పాటు చెత్త గుట్టలు పేరుకుని , మిథేన్ గ్యాస్ ఉత్పత్తి కాకుండా కాపాడగలనుని చెప్పారు . ప్రతియేటా జనవరి 4 ని బయో ఎంజెమ్స్ దినోత్సవంగా నిర్వహిస్తారని , ఆరోజు తాను కాయగూరలతో రూపొందించిన 40 లీటర్ల ఎంజెమైను గీతం ప్రాంగణం పక్కనున్న చెరువులో కలుపుతానని , అది నీటి పీహెచ్ స్థాయి పెరగడానికి తోడ్పడడంతో పాటు చేపల వృద్ధికి కూడా ఉపకరిస్తుందన్నారు . తొలిసారి కరోనా విజృంభించినప్పుడు తాను ఓ అభిరుచిగా చేపట్టిన బయో ఎంజెమ్స్ కార్యక్రమం నేడు . ఎంతోమందికి ఉపకరిస్తుందని ఆమె చెప్పారు . థాయిలాండ్లోని బయో ఎంజెమ్స్ శిక్షకురాలి సహకారంతో రూపొందించిన పలు బయో ఎంజెమ్స్ ను ఆమె చూపించారు . పలువురి సందేహాలను నివృత్తి చేశారు .

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

13 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

13 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

13 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago