మనవార్తలు ,హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం బిసిల కోసం ప్రత్యేక మంత్రత్వశాఖను ఏర్పాటు చేయాలిసోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘‘కేంద్రలో బీసీమంత్రిత్వశాఖ ఏర్పాటు, ‘‘జనాభా గణనలో కులగణన’’, చేపట్టాలనే అంశంపై జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అధ్యక్షత వహించారు. సమన్వయ కర్తగా బీసీ ఫెడరేషన్కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు .
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ శివ ముదిరాజ్ మాట్లాడుతూ జన గణనలో కుల గణన , కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో 27%రిజర్వేషన్ అమలు చేయాలని, బిసి ఫెలోషిప్స్ 1000 నుండి 10వేలకు పెంచాలని, బిసిలకు sc, St,లకు మాదిరిగానే ఫిజ్ స్టక్క్షర్ మార్చాలని, దేశ వ్యాప్తంగా సావిత్రి బాయి గారి పేరుతో మహిళా డిగ్రీ,పీజీ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు బిసిల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ప్రత్యేక స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, బిసి మేధావులు, రీసెర్చ్ స్కాలర్ పాల్గొన్నారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…