మనవార్తలు ,హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం బిసిల కోసం ప్రత్యేక మంత్రత్వశాఖను ఏర్పాటు చేయాలిసోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘‘కేంద్రలో బీసీమంత్రిత్వశాఖ ఏర్పాటు, ‘‘జనాభా గణనలో కులగణన’’, చేపట్టాలనే అంశంపై జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అధ్యక్షత వహించారు. సమన్వయ కర్తగా బీసీ ఫెడరేషన్కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు .
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ శివ ముదిరాజ్ మాట్లాడుతూ జన గణనలో కుల గణన , కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో 27%రిజర్వేషన్ అమలు చేయాలని, బిసి ఫెలోషిప్స్ 1000 నుండి 10వేలకు పెంచాలని, బిసిలకు sc, St,లకు మాదిరిగానే ఫిజ్ స్టక్క్షర్ మార్చాలని, దేశ వ్యాప్తంగా సావిత్రి బాయి గారి పేరుతో మహిళా డిగ్రీ,పీజీ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు బిసిల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ప్రత్యేక స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, బిసి మేధావులు, రీసెర్చ్ స్కాలర్ పాల్గొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…