Telangana

శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు ఘన సన్మానం

– ఘనంగా నిర్వహించిన భాగ్యనగర్ శివాజీ సేవాసమితి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్న న్యాయం, ప్రజా సంక్షేమ దృక్పథం, స్వాభిమాన భావం నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు .కుత్బుల్లాపూర్‌లో భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జర్నలిస్టులను సన్మానించారు . అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో అవగాహన పెంపొందించడంలో, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు నిష్పక్షపాత ధోరణితో పనిచేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చూపిన పరిపాలనా నైపుణ్యం, సాహసస్ఫూర్తి ప్రతి నాయకుడికి ఆదర్శమని అన్నారు. మీడియా సమాజానికి దారిదీపంలా పనిచేస్తోందని, విలువల ఆధారిత జర్నలిజం సమాజ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మధ్యవి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చరిత్రను యువతలో విస్తృతంగా పరిచయం చేయడంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ గౌరవం పరిరక్షణలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌లను శాలువాలు, స్మారక చిహ్నాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర, ఆయన యుద్ధ వ్యూహాలు, ప్రజా పరిపాలనలో చేసిన సంస్కరణలపై ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమానికి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. సమాజానికి సేవలందిస్తున్న మీడియా ప్రతినిధులను గౌరవించడం ద్వారా శివాజీ మహారాజ్ స్ఫూర్తిని ఆచరణలో నిలబెట్టినట్లయిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago