Telangana

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 27న చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను జయప్రదం చేయండి_సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని సోమవారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం గత 19 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు బిల్ కలెక్టర్లు, కారోబార్, డ్రైవర్ లు గా వివిధ పనుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బిల్ కలెక్టర్,కారోబార్లకు కనీస వేతనం 19600 రూపాయలు,పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 16600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలన్నారు.పటాన్ చెరు మండలంలోని రుద్రారo, భానూర్, ఇంద్రేశం గ్రామాల్లో గత 3నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.జిన్నారం, అమీన్ పూర్,గుమ్మదిదల మండలాల్లో కూడా జీతాలు పెండింగులో వున్నాయని అన్నారు.సబ్బులు,నూనెలు,టవల్స్,చెప్పులు సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు. అదేవిధంగా యూనిఫాం లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమ్మె ను నీరు కార్చ డానికి పంచాయతీ కార్యదర్శులు,ఎం పి డి వో లు కార్మికులను బయపెట్టిస్తున్నరని ఆరోపించారు.సమ్మెలోకి వెళ్తున్నామని సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27 న జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సందర్భంగా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోబిక్షపతి,వేణు,జంగయ్య,శ్రీనివాస్,రాజు,మల్లేశ్, మానయ్య లు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago