Telangana

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 27న చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను జయప్రదం చేయండి_సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని సోమవారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం గత 19 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు బిల్ కలెక్టర్లు, కారోబార్, డ్రైవర్ లు గా వివిధ పనుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బిల్ కలెక్టర్,కారోబార్లకు కనీస వేతనం 19600 రూపాయలు,పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 16600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలన్నారు.పటాన్ చెరు మండలంలోని రుద్రారo, భానూర్, ఇంద్రేశం గ్రామాల్లో గత 3నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.జిన్నారం, అమీన్ పూర్,గుమ్మదిదల మండలాల్లో కూడా జీతాలు పెండింగులో వున్నాయని అన్నారు.సబ్బులు,నూనెలు,టవల్స్,చెప్పులు సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు. అదేవిధంగా యూనిఫాం లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమ్మె ను నీరు కార్చ డానికి పంచాయతీ కార్యదర్శులు,ఎం పి డి వో లు కార్మికులను బయపెట్టిస్తున్నరని ఆరోపించారు.సమ్మెలోకి వెళ్తున్నామని సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27 న జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సందర్భంగా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోబిక్షపతి,వేణు,జంగయ్య,శ్రీనివాస్,రాజు,మల్లేశ్, మానయ్య లు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

14 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

14 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

14 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

14 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

14 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

3 days ago