Telangana

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 27న చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను జయప్రదం చేయండి_సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని సోమవారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం గత 19 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు బిల్ కలెక్టర్లు, కారోబార్, డ్రైవర్ లు గా వివిధ పనుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బిల్ కలెక్టర్,కారోబార్లకు కనీస వేతనం 19600 రూపాయలు,పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 16600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలన్నారు.పటాన్ చెరు మండలంలోని రుద్రారo, భానూర్, ఇంద్రేశం గ్రామాల్లో గత 3నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.జిన్నారం, అమీన్ పూర్,గుమ్మదిదల మండలాల్లో కూడా జీతాలు పెండింగులో వున్నాయని అన్నారు.సబ్బులు,నూనెలు,టవల్స్,చెప్పులు సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు. అదేవిధంగా యూనిఫాం లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమ్మె ను నీరు కార్చ డానికి పంచాయతీ కార్యదర్శులు,ఎం పి డి వో లు కార్మికులను బయపెట్టిస్తున్నరని ఆరోపించారు.సమ్మెలోకి వెళ్తున్నామని సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27 న జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సందర్భంగా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోబిక్షపతి,వేణు,జంగయ్య,శ్రీనివాస్,రాజు,మల్లేశ్, మానయ్య లు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago