Categories: politics

దేశం మరువని దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ_నీలం మధు ముదిరాజ్

_నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన మహనీయుడాయన 

_రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ..

_26 రోజులపాటు రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాదివేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన భారత దేశ తొలి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో మహోజ్వల ప్రగతి సాధించేలా పాలన కొనసాగించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి ఆధునిక భారతం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేశారని కొనియాడారు.నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ను చిన్నారులంతా ముద్దుగా చాచా నెహ్రు అని సంబోధిస్తారని ఆ మహానేత జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆ మహనీయుడు నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ప్రజాక్షేత్రంలో తెలియజేయడానికి నెహ్రు జయంతి నుంచి 26 రోజులపాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవం లో భాగంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్పష్టంగా వివరిస్తూ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago