_నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన మహనీయుడాయన
_రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ..
_26 రోజులపాటు రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు..
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాదివేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన భారత దేశ తొలి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో మహోజ్వల ప్రగతి సాధించేలా పాలన కొనసాగించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి ఆధునిక భారతం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేశారని కొనియాడారు.నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ను చిన్నారులంతా ముద్దుగా చాచా నెహ్రు అని సంబోధిస్తారని ఆ మహానేత జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆ మహనీయుడు నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ప్రజాక్షేత్రంలో తెలియజేయడానికి నెహ్రు జయంతి నుంచి 26 రోజులపాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవం లో భాగంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్పష్టంగా వివరిస్తూ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…