Telangana

సమిష్టి సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా ఇస్నాపూర్

ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు సంక్షేమ.. పథకాలు

పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం వార్డు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సుమలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన పురపాలిక తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా 5 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వీటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి వార్డుని అభివృద్ధి పతంలో ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి రెడ్డి, కమిషనర్ వెంకట కిషన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago