Districts

దేశంలోనే వినూత్న పథకాలు కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్

_82 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మనవార్తలు,పటాన్ చెరు:

పేదింటి ఆడబిడ్డ వివాహం భారం కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన 82 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం తో ప్రారంభమైన ఈ రెండు పథకాలు నేడు లక్ష 116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 5478 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

మార్చి 13న పటాన్‌చెరులో  ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు

27 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని వచ్చే…

1 hour ago

ముందుగా మనం భారతీయులం

గీతం ఫెస్ట్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మనం ఏ ప్రాంతం,…

1 hour ago

ఏఐతో నైపుణ్యాభివృద్ధి, కొత్త అవకాశాలకు బాటలు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్రో మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కృత్రిమ మేధస్సు…

1 hour ago

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

15 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

16 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

16 hours ago