Telangana

విజయవంతంగా ముగిసిన ఇండస్ట్రీ కాంక్లేవ్

విద్యా సంస్థలు – పరిశ్రమల మధ్య అంతరాన్ని

తగ్గించేలా అర్థవంతమైన చర్చలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) కాలంలో జెన్-జెడ్: పునర్ నిర్మించే పని’ అనే అంశంపై ఒక రోజు ఇండస్ట్రీ కాంక్లేవ్ ను విజయవంతంగా నిర్వహించారు. ఇది ఆధునిక పని ప్రదేశంలో అభివృద్ధి చెందుతున్న గతిశీలతను అన్వేషించడానికి ప్రముఖ పరిశ్రమ నాయకులను ఒకచోట చేర్చింది.మూన్ లైట్ సహ వ్యవస్థాపకుడు, వ్యాపార సలహాదారు, హచ్-వోడాఫోన్ మాజీ కార్యనిర్వహణాధికారి సామ్యూల్ సెల్వకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. అహ్మదాబాదులోని అదానీ గ్రూపు మానవ వనరుల విభాగం మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం బిట్స్-పిలానీ హైదరాబాదు ప్రాంగణంలో అనుబంధ అధ్యాపకుడు అనిల్ కలప విశిష్ట వక్తగా వ్యవహరించారు.

ఈ కాంక్లేవ్ లో భాగంగా రెండు ఆకర్షణీయమైన ప్యానెల్ చర్చలు జరిగాయి. మొదటి ప్యానెల్ లో వరుణ్ గోయల్ (యూనివర్సిటీ రిలేషన్స్ లీడర్, ఎర్లీ కెరీర్, నోకియా); ఎం. అజయ్ (సీహెచ్ఆర్వో, ఓక్ ట్రీ క్యాపిటల్); జయశ్రీ సాథి (స్టేట్ స్ట్రీట్ మేనేజింగ్ డైరెక్టర్) పాల్గొని, ‘ఏకాగ్రతను భంగపరిచే ప్రపంచంలో స్థిరమైన కెరీర్లు’ అనే అంశంపై చర్చించారు.రెండవ ప్యానెల్ లో షాలిని సహాయ్ (సీనియర్ ఉపాధ్యక్షురాలు, హెడ్-మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్); నాగార్జున మల్లాడి (ఉపాధ్యక్షుడు, హెడ్ – ఏఐ కేపబిలిటీ డెవలప్ మెంట్, టెక్ మహీంద్రా); గిరి ప్రసాద్ తేజోమూర్తి (అధ్యక్షుడు, రాణే మద్రాస్ లిమిటెడ్, ఆఫ్టర్ మార్కెట్ ప్రొడక్ట్స్ డివిజన్) ఉన్నారు. వారు ‘మానవ-కృత్రిమ మేధస్సు భాగస్వామ్యం: ఉద్యోగాలను భర్తీ చేయడం కాదు, పాత్రలను పునర్నిర్వచించడం’ అనే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

వీటికి అదనంగా, దీపక్ తాడూరు, హర్షవర్థన్ నాయకత్వం, మార్గదర్శకుడు (ట్రైల్ బ్లేజర్) అనే అంశాలపై ప్రసంగించారు. పీడబ్ల్యూసీ ఉమెన్ లీడర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను పూర్తిచేసిన విద్యార్థులకు విశిష్ట అతిథులు ప్రశంసా పత్రాలను బహుకరించారు. అలాగే వేసవి ఇంటర్నషిప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఐదుగురు ఎంబీఏ విద్యార్థులకు అవార్డులను కూడా అందజేశారు.గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా సమావేశం లక్ష్యాన్ని వివరించి, అతిథులను స్వాగతించగా, మార్కెటింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, కెరీర్ సర్వీసెస్-పీజీ ప్రోగ్రామ్ చైర్ డాక్టర్ రాకేష్ నాయుడు వందన సమర్పణ చేశారు.విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య అర్థవంతమైన పరస్పర చర్యలను పెంపొందించే నెట్ వర్కింగ్ భోజనంతో ఈ కాంక్లేవ్ ముగిసింది.

admin

Recent Posts

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

18 hours ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

19 hours ago

ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

21 hours ago

మానవత్వం చాటుకున్న తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక…

1 day ago

ఆగస్టు 30న గండిగూడెం గ్రామ దేవతల ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన, ప్రారంభోత్సవం

దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :…

1 day ago

హైలైఫ్ జూవెల్స్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రింన సినీన‌టి కామాక్షి భాస్క‌ర్ల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్ర‌ముఖ జ్యూవెల‌రీ సంస్థలు వినియోగ‌దారుల కోసం ఒకే వేదిక‌పై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…

2 days ago