politics

భార‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింది – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

మనవార్తలు ,పటాన్ చెరు:

భార‌త్ అన్ని రంగాల్లో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్తంగి గ్రామంలో బీజేపీ నేత‌లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏనిమిదేళ్ళ సేవ, సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు.ప్ర‌ధాని మోదీ చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు , పాల‌నా సంస్క‌ర‌ణ‌లు , కోవిద్ స‌మ‌యంలో మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు .

కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు కలిసిమెలసి ఉంటూ దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్నారని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని కృషితో అతిస్వల్ప కాలంలోనే దేశీయంగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడమేకాకుండా ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలుగామ‌న్నారు . శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాల్లో మనదేశం ప్రపంచంలోనే ముందువరుసలో ఉందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి జయశ్రీ, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందించారు. మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి దేవెందర్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, కార్యదర్శి బైండ్ల కుమార్, ఉపాధ్యక్షులు బాబు రాజు, నాయకులు వీరారెడ్డి, పుణ్యవతి, పుష్పా, సాయి, నరెందర్, షకీల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

2 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago