పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు నియోజకవర్గంలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 లక్షల 61 వేల 569 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు . హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 లక్షల 46 వేల 712 రూపాయలు, అన్నదానం హుండీలో లక్ష 14 వేల857 రూపాయలు భక్తులు సమర్పించుకున్నట్లు ఆలయ ఈవో లావణ్య తెలిపారు .ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతయ్యగా స్వయంభుగా వెలసిన స్వామి భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలను నెరవేరుస్తూ నిరంతరం పూజలు అందుకుంటున్నారని ఈవో లావణ్య తెలిపారు. భక్తులకు నమ్మకంతో కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తునికి సిద్ధి గణపతి స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో ఛైర్మన్ హరిప్రసాద్ రెడ్డి , దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ , ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహ గౌడ్, నాగరాజు గౌడ్, నరసింహులు, కృష్ణవేణి, నరసింహారెడ్డితో పాటు సేవా సమితి సభ్యులు, అర్చకులు,రుద్రారం గ్రామ పెద్దలు ,భక్తులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…