పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు నియోజకవర్గంలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 లక్షల 61 వేల 569 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు . హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 లక్షల 46 వేల 712 రూపాయలు, అన్నదానం హుండీలో లక్ష 14 వేల857 రూపాయలు భక్తులు సమర్పించుకున్నట్లు ఆలయ ఈవో లావణ్య తెలిపారు .ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతయ్యగా స్వయంభుగా వెలసిన స్వామి భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలను నెరవేరుస్తూ నిరంతరం పూజలు అందుకుంటున్నారని ఈవో లావణ్య తెలిపారు. భక్తులకు నమ్మకంతో కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తునికి సిద్ధి గణపతి స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో ఛైర్మన్ హరిప్రసాద్ రెడ్డి , దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ , ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహ గౌడ్, నాగరాజు గౌడ్, నరసింహులు, కృష్ణవేణి, నరసింహారెడ్డితో పాటు సేవా సమితి సభ్యులు, అర్చకులు,రుద్రారం గ్రామ పెద్దలు ,భక్తులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…