Telangana

మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి

– మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి

– బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల ఓపెన్ సవాల్

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :

బొల్లారం అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు చర్చకు సిద్ధమేనా అంటూ బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు ఓపెన్ సవాల్ విసిరారు. శనివారం బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు ఎక్కడ నాటారని ప్రశ్నించారు. ఎంతమందికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందించారని చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి సంవత్సరం గడిచిన స్థానిక బిఆర్ఎస్ నాయకులు అదే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే నాయకులని మండిపడ్డారు. అందుకోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మారడం స్థానిక నాయకులకు అలవాటేనన్నారు. ఇక మీ పప్పులు ఉడకవని హెచ్చరించారు. మూడో వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని కౌన్సిలర్ను డిమాండ్ చేశారు. మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ చౌరస్తాలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పాలకవర్గం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ గారు, చంద్రయ్య గారు, నర్సింహారాజు గారు, నాయకులు లక్ష్మా రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ రాజు గారు, రాజ్ గోపాల్ గారు, చంద్రారెడ్డి గారు, మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ గారు, చక్రపాణి గారు, రవీందర్ రెడ్డి గారు, శేఖర్ గారు, యువజన నాయకులు అబ్దుల్ బషీర్ గారు, ఇమ్రాన్ గారు, ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

13 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

13 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

13 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago