Telangana

మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి

– మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి

– బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల ఓపెన్ సవాల్

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :

బొల్లారం అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు చర్చకు సిద్ధమేనా అంటూ బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు ఓపెన్ సవాల్ విసిరారు. శనివారం బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు ఎక్కడ నాటారని ప్రశ్నించారు. ఎంతమందికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందించారని చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి సంవత్సరం గడిచిన స్థానిక బిఆర్ఎస్ నాయకులు అదే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే నాయకులని మండిపడ్డారు. అందుకోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మారడం స్థానిక నాయకులకు అలవాటేనన్నారు. ఇక మీ పప్పులు ఉడకవని హెచ్చరించారు. మూడో వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని కౌన్సిలర్ను డిమాండ్ చేశారు. మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ చౌరస్తాలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పాలకవర్గం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ గారు, చంద్రయ్య గారు, నర్సింహారాజు గారు, నాయకులు లక్ష్మా రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ రాజు గారు, రాజ్ గోపాల్ గారు, చంద్రారెడ్డి గారు, మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ గారు, చక్రపాణి గారు, రవీందర్ రెడ్డి గారు, శేఖర్ గారు, యువజన నాయకులు అబ్దుల్ బషీర్ గారు, ఇమ్రాన్ గారు, ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

20 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

22 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago