Telangana

మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి

– మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి

– బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల ఓపెన్ సవాల్

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :

బొల్లారం అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు చర్చకు సిద్ధమేనా అంటూ బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు ఓపెన్ సవాల్ విసిరారు. శనివారం బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు ఎక్కడ నాటారని ప్రశ్నించారు. ఎంతమందికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందించారని చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి సంవత్సరం గడిచిన స్థానిక బిఆర్ఎస్ నాయకులు అదే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే నాయకులని మండిపడ్డారు. అందుకోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మారడం స్థానిక నాయకులకు అలవాటేనన్నారు. ఇక మీ పప్పులు ఉడకవని హెచ్చరించారు. మూడో వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని కౌన్సిలర్ను డిమాండ్ చేశారు. మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ చౌరస్తాలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పాలకవర్గం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ గారు, చంద్రయ్య గారు, నర్సింహారాజు గారు, నాయకులు లక్ష్మా రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ రాజు గారు, రాజ్ గోపాల్ గారు, చంద్రారెడ్డి గారు, మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ గారు, చక్రపాణి గారు, రవీందర్ రెడ్డి గారు, శేఖర్ గారు, యువజన నాయకులు అబ్దుల్ బషీర్ గారు, ఇమ్రాన్ గారు, ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago