అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అన్ని తాండాలలో సంత శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ తాండాలో నూతనంగా నిర్మించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ మాత దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడంతో పాటు రాజకీయరంగంలోనూ రిజర్వేషన్లు కల్పించి పరిపాలనలో భాగస్వాములు చేసిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నియోజకవర్గంలోనూ గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాధవి రవి నాయక్, కిష్టారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…