మనవార్తలు ,శేరిలింగంపల్లి:
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెల రక్తం అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని విక్టరీ బాయ్స్ ప్రతినిధులు కొమ్ముగూరి ప్రదీప్ అన్నారు . రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లో “మదర్ థెరిస్సా” రక్తదాన కేంద్రంలో విక్టరీ బాయ్స్ యువత రక్తదాన చేశారు . 73 వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని ప్రతీ ఏడాదిలాగే ఈసారి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 8వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు .
తలసేమియా ప్రాణాంతకర వ్యాధి అని ఎంతో మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో రక్తదాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ..దీంతో ఎంతో మంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు .రక్తదానం చేయడంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు . యువత స్వచ్చంధంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు . కోవిడ్ మహమ్మారి తో పోరాడుతూనే అలాగే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఈ కార్యక్రమంలో కొమ్ముగూరి ప్రదీప్,పృద్వి రాజ్, జాక్సన్ ,అనిల్ మనీష్ బృందాన్ని రక్తదాన కేంద్ర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…