Telangana

హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024

మనవార్తలు ,హైదరాబాద్: 

రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సంస్థలకు , ప్రముఖులకు 50 కి పైగా అవార్డులు, నామినేషన్ లకు ఆహ్వానం.మహా సిమెంట్స్ సమర్పించు హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు కార్యక్రమంలో అవార్డుల నామినేషన్ల పోస్టర్ తో పాటు అవార్డును ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా మహా సిమెంట్స్ వ్యవహరిస్తోంది. అలాగే వీర కాంక్రీట్ , ఎల్ఐసి హోసింగ్ ఫైనాన్స్, నాగార్జున టిఎంటి , ఫార్చ్యూన్ ఆర్ట్ ఎల్ఇడి లైటింగ్స్,సుధాకర్ పైప్స్ , ఫిట్టింగ్స్, బెల్జిన్ వైర్స్ కేబుల్స్ ,పెట్ హోమ్ ఆటోమేషన్, అభిమన్య డోర్స్, పవర్ టెక్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు టఫ్ స్టోన్స్ బ్లాక్స్ ,పెవర్స్ తమ సహకారాన్ని అందిస్తున్నారు.

నామినేషన్లకు ఆహ్వానం
———————-

రియల్ ఎస్టేట్ రంగంలో గత దశాబ్దాలుగా ఉత్తమమైన సేవలను అందిస్తూ ఈ రంగంలో రాణిస్తున్న ప్రముఖులను హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 ద్వారా ఘనంగా సత్కరిస్తూ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరి 25 వ తేది, హెచ్ఐసిసి నోవోటల్ లో ఈ అవార్డుల వేడుక జరుగనుంది. అవార్డుల కోసం వచ్చిన నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో భాగంగా హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో రియాల్టీ రంగంతో పాటు విభిన్న రంగాల్లో వున్న జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణుల చేత అవార్డుల ఎంపిక జరుగనుంది. ఇందులో పరిశ్రమ అనుభవం, ప్రాజెక్ట్ కౌంట్, ప్రాజెక్టు వ్యయ ప్రమాణాల ఆధారంగా వివిధ విభాగాలలో 50 కి పైగా అవార్డులను జ్యూరీ కమిటీ నామినేట్ చేయనుంది.డిజిటల్ మీడియా రంగంలో సరి కొత్త పధ్దతిలో అత్యుత్తమంగా రాణిస్తున్న హైబిజ్.టివి భారత దేశంలో డిజిటల్ బిజినెస్ న్యూస్ ఛానెల్ లో ఒకటి. ప్రతి రోజు 5 లక్షలకు పైగా వీక్షకులను కలిగి విభిన్న రంగాలలో ప్రతిభను కనబరుస్తున్న వారి కథనాలను వీక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంది.నిష్పాక్షిక మరియు పారదర్శకతతో రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించిన వారి కృషిని గుర్తిస్తూ.. ఆర్థిక వ్యవస్థ అభివృధ్దిలో తమ సహకారాన్ని అందిస్తూ సామాన్యుడి ఇంటి కలను సాకారం చేస్తున్న వారి కృషిని గుర్తిస్తోంది ఈ కార్యక్రమంలో వి.రాజశేఖర్ రెడ్డి,క్రెడాయ్ హైదరబాద్ ప్రెసిడెంట్, పి.నర్సింహా రెడ్డి,డైరెక్టర్, వీర ఆర్ఎంసీ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ , అదితి శ్రీమాల్, డైరెక్టర్, ఫార్చున్ ఆర్ట్ ఎల్ ఈడీ లైటింగ్, ప్రకాష్ రాగి, డైరెక్టర్ రాగి , ఎం. రాజగోపాల్ , పౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైబిజ్ టీవీ , తెలుగు నవ్ పాల్గొన్నారు.

నామినేషన్ల కోసం ధరఖాస్తులకు చివరి తేదీ: 18-01-2024

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago