శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలో శిక్షణ పొందిన ఆ విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల రాయదుర్గం లోని నాగార్జున హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఎస్. హరిచరణ్ ఢిల్లీ లో రెజిలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో జూనియర్ చాంపియన్ షిప్ విభాగంలో తన సత్తా చాటి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. మంచి పట్టుదలతో తన ప్రతిభతో మెడల్ సాధించిన హరిచరణ్ ను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీలతో పాటు సిబ్బంది అభినందించారు. తన విజయంతో తమ స్కూల్ కు, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచిపేరు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…