Telangana

తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలకంతా శుభం కలగాలి_నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్న నీలం మధు..

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్న నీలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విశ్వ వసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం చిట్కుల్ గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఉగాది పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణులను తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయమన్నారు. భారతీయ సంస్కృతిలో జ్యోతిషశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం మాత్రమే కాకుండా భవిష్యత్తును అంచనా వేసే విధంగా పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారన్నారు. విశ్వవసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పంచాంగ శ్రవణం లో పండితులు వివరించారని తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతూ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago