Telangana

తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలకంతా శుభం కలగాలి_నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్న నీలం మధు..

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్న నీలం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విశ్వ వసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అనంతరం చిట్కుల్ గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఉగాది పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణులను తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయమన్నారు. భారతీయ సంస్కృతిలో జ్యోతిషశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం మాత్రమే కాకుండా భవిష్యత్తును అంచనా వేసే విధంగా పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారన్నారు. విశ్వవసు నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పంచాంగ శ్రవణం లో పండితులు వివరించారని తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతూ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

18 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

20 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago