మనవార్తలు ,పటాన్ చెరు:
సంతోషమే సగం బలమని , ఏ కార్యాన్ని అయినా చిరునవ్వుతో , ఎటువంటి ఆందోళనకు తావివ్వకుండా చేపడితే విజయం సాధించడం తథ్యమని ప్రముఖ నవలా సినీ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు . హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ మేథస్సును పెంపొందించుకోవడం – జ్ఞాపకశక్తి ‘ ( డెవలపింగ్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ పవర్ ) అనే అంశంపై గురువారం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . ఆది నుంచి అంతం వరకు ఎంతో ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్యం కోరికలు , చూసేవారు ప్రదర్శకుల గురించి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ , మనస్సు – హృదయం ఏకకాలంలో ఆజ్ఞలను ఎలా ప్రసారం చేస్తాయో , ఒక వ్యక్తి సరెన వెఖరిని తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు .
సరైన సమయంలో పోటీలో ఇతరులను అధిగమించడానికి ఏకాగ్రత , జ్ఞాపకశక్తిని పెంపొందించడం చాలా అవసరమని చెబుతూ , ఒక వ్యక్తిలో ఏకాగ్రత లోపానికి గల వివిధ కారణాలప్పై విడమరచి చెప్పారు . అందరిలో మంచివాడు అనిపించుకోవడం కంటే తెలివి తక్కువ మరొకటి లేదని డాక్టర్ యండమూరి స్పష్టీకరించారు . ఈ రోజు ఆనందంగా ఉండడం , రేపు కూడా ఆనందంగా ఉండగలను అనుకోవడమే విజయంగా ఆయన అభివర్ణించారు . పెంపుడు జంతువులపై ప్రదర్శించే ప్రేమను కూడా తాతలు , అమ్మమ్మ , నాయనమ్మలపై ప్రదర్శించడంలేదని , స్పర్శ ద్వారా ప్రేమను ప్రకటించడం ఉత్తమమని పేర్కొన్నారు . ఏదైనా నొప్పితో వారు బాధపడుతుంటే ఆత్మీయ స్పర్శతో లేపనాన్ని రాస్తే త్వరిత ఉపశమనం లభిస్తుందని , అది అనుభవం ద్వారానే బోధపడుతుందన్నారు . తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు కొంత సమయం కేటాయించాలని , అరమరిక లేని బంధాన్ని వారితో ఏర్పరచుకుంటే చాలా సమస్యలు వాటంతట అనే పరిష్కారమవుతాయని డాక్టర్ యండమూరి స్పష్టీకరించారు .
మనందరం ఒకేలా తల్లి గర్భం నుంచి ఉద్భవించినా , రకరకాల ముసుగులు ధరిస్తామని , కొంతమంది ఉత్సాహంగా , మరికొందరు నిరుత్సాహంగా , పేలవంగా ఉంటారని అదే మన వ్యక్తిత్వమని వ్యక్తిత్వ వికాస నిపుణుడెన వీరేంద్రనాథ్ పేర్కొన్నారు . విద్యార్థుల ఉత్సాహాన్ని కొనసాగించడానికి కొన్ని ప్రశ్నలడిగి , సరైన జవాబులిచ్చిన వారికి తక్షణమే బహుమతులు ప్రదానం చేశారు . తన ప్రశ్నావళికి సరైన జవాబులిచ్చిన విద్యార్థులను వేదికపైకి ఆహ్వానించి , అందరికీ బహుమతులు ఇవ్వడమే కాకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బంగారు పతకం , ప్రశంసా పత్రాలను బహుకరించారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి సత్కరించారు . విజయ్ ఈవెంట్స్ అధినేత శ్రీ విజయరామరాజు , వివిధ విభాగాధిపతులు , అధ్యాపకులు , తొలి ఏడాది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు .
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…