Categories: politicsTelangana

పరిశోధన ప్రచురణ నైతికతపై గీతం ప్రొఫెసర్ మార్గదర్శనం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ కొల్హాపూర్ (మహారాష్ట్ర)లోని డి వై పాటిల్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధన ప్రచురణ నైతికత అనే అంశం నిర్వహించిన ఒకరోజు అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్.డీ.పీ)లో ముఖ్య వక్తగా పాల్గొని, ఉపన్యసించారు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె సదస్యులకు మార్గదర్శనం చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

నైతిక పరిశోధన, విద్వత్ ప్రచురణల ప్రాముఖ్యతపై డాక్టర్ పర్వేకర్ దృష్టి సారించినట్టు తెలిపారు. పరిశోధన సమగ్రత, ప్రచురణ నైతికత, సాహిత్య చోరీ నివారణ, పీర్ రివ్యూ, బాధ్యతాయుతమైన పరిశోధన ప్రవర్తన, నాణ్యమైన పరిశోధనను ప్రచురించడానికి ఉత్తమ పద్ధతులు వంటి కీలక అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించినట్టు పేర్కొన్నారు.

అధ్యాపక సభ్యులు, పరిశోధనా పండితులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, విద్యా పరిశోధనలో ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించడంపై వారు వక్తతో చురుకుగా సంభాషించినట్టు తెలిపారు. ఈ ముఖాముఖి కార్యక్రమం, శాస్త్రీయ ప్రచురణలలో సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పిందన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంగ్రామ్ పాటిల్, నిర్వాహక కమిటీతో పాటు అందులో పాల్గొన్న వారందరికీ డాక్టర్ పర్వేకర్ ధన్యవాదాలు తెలియజేసిందన్నారు. ఇటువంటి ఎఫ్.డీ.పీ.లు నైతిక పరిశోధన పద్ధతులను బలోపేతం చేస్తాయని, జ్జాన వినిమయాన్ని ప్రోత్సహిస్తాయని, సహకార అభ్యాసం ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని ఆమె అభిప్రాయపడినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్…

14 hours ago

ప్రభుత్వ బడుల్లో మత ప్రచారాలు చేపిస్తారా?

అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా? ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్…

14 hours ago

ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని…

14 hours ago

‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్…

14 hours ago

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

1 day ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

1 day ago