మనవార్తలు ,పటాన్ చెరు:
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్న గీతం అధికారులు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణానికి హరిత హారం అవార్డు వచ్చినట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . హరిత హారంలో భాగంగా 2021 సంవత్సరంలో గీతం 32 వేలకు పైగా మొక్కలు నాటినందుకు గాను జాతీయ పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ ) తెలంగాణ విభాగం హైదరాబాద్లో మార్చి 3 న నిర్వహించిన వార్షిక సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేసినట్టు తెలిపారు .
తెలంగాణ ఐటీ , పరిశ్రమలు , పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా ఈ అవార్డును గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అందుకున్నట్టు పేర్కొన్నారు . గీతమ్ అధిక సంఖ్యలో మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్టు డాక్టర్ శివప్రసాద్ తెలియజేశారు . దీనికి గుర్తింపుగానే గత ఐదేళ్ళుగా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గీతం అందుకున్నట్టు ఆయన వివరించారు . ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఐల తెలంగాణ చెర్మన్ కృష్ణ , బొందనపు , భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ యెల్ల , తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , సీఐఐ ఉన్నతాధికారులు తదితరులు కూడా పాల్గొన్నట్టు ఆ ప్రకటనలో
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…