మనవార్తలు ,పటాన్ చెరు:
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్న గీతం అధికారులు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణానికి హరిత హారం అవార్డు వచ్చినట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . హరిత హారంలో భాగంగా 2021 సంవత్సరంలో గీతం 32 వేలకు పైగా మొక్కలు నాటినందుకు గాను జాతీయ పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ ) తెలంగాణ విభాగం హైదరాబాద్లో మార్చి 3 న నిర్వహించిన వార్షిక సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేసినట్టు తెలిపారు .
తెలంగాణ ఐటీ , పరిశ్రమలు , పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా ఈ అవార్డును గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అందుకున్నట్టు పేర్కొన్నారు . గీతమ్ అధిక సంఖ్యలో మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్టు డాక్టర్ శివప్రసాద్ తెలియజేశారు . దీనికి గుర్తింపుగానే గత ఐదేళ్ళుగా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గీతం అందుకున్నట్టు ఆయన వివరించారు . ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఐల తెలంగాణ చెర్మన్ కృష్ణ , బొందనపు , భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ యెల్ల , తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , సీఐఐ ఉన్నతాధికారులు తదితరులు కూడా పాల్గొన్నట్టు ఆ ప్రకటనలో
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…