మనవార్తలు ,పటాన్ చెరు:
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్న గీతం అధికారులు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణానికి హరిత హారం అవార్డు వచ్చినట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . హరిత హారంలో భాగంగా 2021 సంవత్సరంలో గీతం 32 వేలకు పైగా మొక్కలు నాటినందుకు గాను జాతీయ పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ ) తెలంగాణ విభాగం హైదరాబాద్లో మార్చి 3 న నిర్వహించిన వార్షిక సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేసినట్టు తెలిపారు .
తెలంగాణ ఐటీ , పరిశ్రమలు , పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా ఈ అవార్డును గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అందుకున్నట్టు పేర్కొన్నారు . గీతమ్ అధిక సంఖ్యలో మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్టు డాక్టర్ శివప్రసాద్ తెలియజేశారు . దీనికి గుర్తింపుగానే గత ఐదేళ్ళుగా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గీతం అందుకున్నట్టు ఆయన వివరించారు . ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఐల తెలంగాణ చెర్మన్ కృష్ణ , బొందనపు , భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ యెల్ల , తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , సీఐఐ ఉన్నతాధికారులు తదితరులు కూడా పాల్గొన్నట్టు ఆ ప్రకటనలో
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…