– గీతమ్ నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో డాక్టర్ డయానా
మనవార్తలు ,పటాన్ చెరు:
ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని , బాగా నిద్రపోవాలని , కనీస శారీరక వ్యాయామం చేయాలని , సమాజంతో కలగలిసి పోవాలని , మద్యం / మాదకద్యవ్యాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ సెక్షాలజిస్టు , హెదరాబాద్ అకాడమీ ఆఫ్ సెక్షాలజీ వ్యవస్థాపక డెరైక్టర్ డాక్టర్ డయానా మోంటెరో అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎసాచ్ఎస్ ) లోని మానసిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో ఒక వక్తగా ఆమె ప్రసంగించారు . ‘ అందరికీ మానసిక ఆరోగ్యం , శ్రేయస్సును అందించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , ప్రవర్తన , ఆలోచన , భావాలను బట్టి మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందన్నారు . ఆశావాదులు ఎక్కువ కాలం జీవించగలరని , కాబట్టి ప్రతి ఒక్కరూ మరింత ఆరోగ్యకరమైన ప్రవర్తనతో మెలగాలని ఆమె సూచించారు .
ఇతరులతో మంచి స్నేహం , సంబంధాలు , సంతృప్తికర కళాశాల జీవనం , మనతో మనం నిరంతరం అనుసంధానం కలిగి ఉండడం మంచిదని డాక్టర్ డయానా హితవు పలికారు . ఏకాగ్రత కోల్పోవడం , ప్రతికూలత , ఆకలి / నిద్ర / మానసిక స్థితిలో మార్పు , పదార్థ దుర్వినియోగం , అస్తవ్యస్తత , ఒంటరిగా ఉండడం , ఒత్తిడికి గురవడం , స్వీయ విధ్వంసక ప్రవర్తనలు అసమతుల్య మానసిక ఆరోగ్యానికి హెచ్చరిక సంకేతాలని డాక్టర్ డయానా వివరించారు . ఫ్రీలాన్స్ ట్రాఫిక్ సెక్షాలజిస్టు అనఘ ‘ మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలను గుర్తించడం ‘ అనే అంశంపై ఎక్స్ప్రెషనిస్ట్ డ్యాన్సర్ పి.చిదానంద శాస్త్రి ‘ ఔషధాలను వినియోగించి మానసిక కృంగుబాటును అధిగమించడం ‘ అనే అంశంపై ఉపన్యసించారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వారు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు . తొలుత కార్యక్రమ నిర్వాహకురాలు మానసిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ అతిథులను పరిచయం చేయగా , విశిష్ట ఆచార్యుడు డాక్టర్ జీని రామారావు వారిని సత్కరించారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…