Telangana

పీసీఐ-క్యూసీఐ జాతీయ ర్యాంకింగ్ లలో గీతం ఫార్మసీకి ప్రతిష్టాత్మక ‘ఎ’ గ్రేడు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సహకారంతో నాబెట్ (NABET) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ర్యాంకింగ్, ఫార్మసీ కళాశాలల రేటింగ్ (తొలి ఎడిషన్)లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాదు, విశాఖపట్నంలోని రెండు ఫార్మసీ స్కూళ్లు అత్యున్నత రేటింగ్ అయిన ప్రతిష్టాత్మక ‘ఎ’ గ్రేడును సాధించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాయని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.ఎస్. కుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఈ జాతీయ మూల్యాంకనంలో భారతదేశ వ్యాప్తంగా బి.ఫార్మసీ కోర్సులను అందిస్తున్న 398 సంస్థలను అంచనా వేసినట్టు తెలియజేశారు. వీటిలో, కేవలం 64 సంస్థలు (16.1 శాతం) మాత్రమే ప్రతిష్టాత్మకమైన ‘ఎ’ గ్రేడును సాధించాయని, ఇది ఈ మూల్యాంకనం యొక్క తీవ్రమైన పోటీతత్వాన్ని స్పష్టం చేస్తోందన్నారు.ఈ ప్రతిష్టాత్మక జాతీయ ర్యాంకింగ్ లో గీతం విశాఖపట్నం 43వ ర్యాంకును సాధించి, దేశంలోని అగ్రశ్రేణి 10.8 శాతం ఫార్మసీ సంస్థలలో ఒకటిగా నిలిచిందని తెలిపారు. అదే సమయంలో, గీతం హైదరాబాదు 54వ ర్యాంకును సాధించి, జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి 13.6 శాతం సంస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఈ విజయం ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, మౌలిక సదుపాయాలు, పరిపాలన, విద్యార్థుల ఫలితాలలో శ్రేష్ఠత పట్ల గీతం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.ఈ గుర్తింపు, నాణ్యత, ఆవిష్కరణ, విద్యా నైపుణ్యంపై విశ్వవిద్యాలయం యొక్క అచంచలమైన దృష్టిని ప్రతిబింబిస్తుందన్నారు. అంతే కాకుండా, ఇది విశ్వవిద్యాలయం యొక్క దూరదృష్టి గల నాయకత్వానికి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల అంకితభావానికి, రెండు ఫార్మసీ స్కూల్స్ చేపట్టిన నిరంతర సంస్థాగత నాణ్యతా కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందని వివరించారు.ఈ అద్భుతమైన జాతీయ విజయం సాధించినందుకు, గీతం నాయకత్వం రెండు ప్రాంగణాలలోని ఫార్మసీ స్కూళ్ల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, సహాయక సిబ్బందిని అభినందించినట్టు తెలియజేశారు. అలాగే, శ్రేష్ఠత పట్ల వారి నిరంతర నిబద్ధతను ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

41 minutes ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

1 hour ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

7 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

19 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

19 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago