Telangana

ఘ‌నంగా రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌లు

విద్యార్థులు విద్య‌తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – సినీన‌టుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్య‌తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సినీన‌టుడు,ర‌చ‌యిత‌,ద‌ర్శ‌కుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువుకు పెద్ద‌లు రెండో స్థానాన్ని ఇచ్చారని చ‌దువు చెప్పిన గురువుల‌ను గౌర‌వించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు .ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, తెలంగాణ & ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ వేడుక విజయాలను గుర్తించడమే కాకుండా ఉత్సాహంతో జరుపుకునే ఒక ప్రయాణం అన్నారు. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో, స్ఫూర్తిని నింపడంలో ముందుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేస్తున్నారన్నారు. వాళ్ల అచంచలమైన నిబద్ధత మా విజయానికి మూలస్తంభం అన్నారు.‌

రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రేరణ, సంరక్షణ అనేవి కేవలం సంచలన పదాలు మాత్రమే కాదని, అవి మా విధానంలో అంతర్భాగాలని తెలిపారు. ‌విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ‘మీలో ప్రతి ఒక్కరూ మన గొప్ప కథలో ఓ అంతర్భాగం, ఈ ఆనందోత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దాం. ఈ అద్భుత ప్రయాణంలో మీరు ఓ ముఖ్యమైన భాగమైందందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని తెలిపారు.’రెసో దర్పణ్’లో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ తెలంగాణ అకడమిక్ డీన్ విద్యాసాగర్, మార్కెటింగ్ మేనేజర్ మార్కండేయులు, జనరల్ మేనేజర్ మల్లేశ్, జోనల్ ఇన్‌ఛార్జ్ వాణి, ప్రిన్సిపాల్ రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు, 1200 విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago