మనవార్తలు ,పటాన్ చెరు:
ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్య ఆవశ్యకత’పై ( Dielectric Relaxations Spectroscopic Studies_of_Hydrogen – Bonded Liquids ) సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వి.మంజులను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెట్స్లోని భౌతిక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తల్లోజు విశ్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . జీవ – ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్యను అర్థం చేసుకోవడం , ప్రోటీన్ల ద్రావణాల వాహకత ప్రవర్తనను గుర్తించి – అర్థం చేసుకోవడం , విత్తన ఉత్పత్తులలో తేమను గుర్తించడం , శరీరంలో అభివృద్ధి చెందిన కణితులను గుర్తించడం ఈ పరిశోధన లక్ష్యంగా ఆయన వివరించారు . ఈ అధ్యయనంలో భాగంగా , ఎనిమిది అంతర్జాతీయ ప్రచురణలతో పాటు ఒక పేటెంట్ను పొందడం , పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని రచించడం విశేషమన్నారు . మంజుల సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష , భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్ . బాలాజీరావు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…