ఎయిమ్స్ డైరెక్టర్ కు గీతం ఫౌండేషన్ అవార్డు – 41వ వ్యవస్థాపక దినోత్సవం, ముఖ్య అతిథిగా డాక్టర్ రణదీప్ గులేరియా

పటాన్‌చెరు:

న్యూఢిల్లీలోని ప్రసిద్ధ వైద్య సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాను గీతం ఫౌండేషన్ అవార్డుతో సత్కరించనున్నారు. గీతం గా పేరొందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ 41వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 14 న డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో గీతం అధ్యక్షుడు Cసమక్షంలో’ ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న డాక్టర్ రణదీప్ గులేరియాను, వైద్య రంగంలో ఆయన అందించిన విశన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుతో పాటు ఒక ఫలకాన్ని ప్రదానం చేయనున్నారు.

భారతీయ సమకాలీన వైద్యశాస్త్ర దీపస్తంభం, నిష్ణాతుడైన పరిశోధకుడు, పరిపాలనాధికారి డాక్టర్ రణదీప్ ఒక ప్రఖ్యాత సర్మోనాలజిస్ట్, సల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ లో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ (ఓఎం) పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. గత 30 ఏళ్ళగా ఎయిమ్స్ లో సేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం పల్మనరీ మెడిసిన్, స్లీప్ డిజార్డర్స్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి ‘గీతం ఫౌండేషన్ అవార్డు’ను మూడు కోట్ల రూపాయల నిధితో ఏర్పాటు చేశారు. విద్య, ఆర్థిక, శాస్త్ర, సాహిత్య, కళలు, ప్రజా సేవలలో అసమాన సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులను ప్రతియేటా ఈ అవార్డుతో సత్కరిస్తున్నారు.

ఇంతకు మునుపు డాక్టర్ కరణ్ సింగ్, పీకే బిష్ణోయ్, డాక్టర్ పీఎంఎస్ ప్రసాద్, డాక్టర్ సంజయ్ బారు, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ బీఆర్ పంచముఖ, డాక్టర్ సి.రంగరాజన్, డాక్టర్ ఏ.శివథాను పిళ్ళై, ప్రొఫెసర్ సీ.ఎస్ఆర్ రావు, డాక్టర్ తకాకి కజిట, డాక్టర్ మెఖేల్ డబ్ల్యూ యంగ్, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రముఖులు గీతం ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

10 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

12 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago