ఎయిమ్స్ డైరెక్టర్ కు గీతం ఫౌండేషన్ అవార్డు – 41వ వ్యవస్థాపక దినోత్సవం, ముఖ్య అతిథిగా డాక్టర్ రణదీప్ గులేరియా

పటాన్‌చెరు:

న్యూఢిల్లీలోని ప్రసిద్ధ వైద్య సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాను గీతం ఫౌండేషన్ అవార్డుతో సత్కరించనున్నారు. గీతం గా పేరొందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ 41వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 14 న డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో గీతం అధ్యక్షుడు Cసమక్షంలో’ ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న డాక్టర్ రణదీప్ గులేరియాను, వైద్య రంగంలో ఆయన అందించిన విశన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుతో పాటు ఒక ఫలకాన్ని ప్రదానం చేయనున్నారు.

భారతీయ సమకాలీన వైద్యశాస్త్ర దీపస్తంభం, నిష్ణాతుడైన పరిశోధకుడు, పరిపాలనాధికారి డాక్టర్ రణదీప్ ఒక ప్రఖ్యాత సర్మోనాలజిస్ట్, సల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ లో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ (ఓఎం) పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. గత 30 ఏళ్ళగా ఎయిమ్స్ లో సేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం పల్మనరీ మెడిసిన్, స్లీప్ డిజార్డర్స్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి ‘గీతం ఫౌండేషన్ అవార్డు’ను మూడు కోట్ల రూపాయల నిధితో ఏర్పాటు చేశారు. విద్య, ఆర్థిక, శాస్త్ర, సాహిత్య, కళలు, ప్రజా సేవలలో అసమాన సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులను ప్రతియేటా ఈ అవార్డుతో సత్కరిస్తున్నారు.

ఇంతకు మునుపు డాక్టర్ కరణ్ సింగ్, పీకే బిష్ణోయ్, డాక్టర్ పీఎంఎస్ ప్రసాద్, డాక్టర్ సంజయ్ బారు, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ బీఆర్ పంచముఖ, డాక్టర్ సి.రంగరాజన్, డాక్టర్ ఏ.శివథాను పిళ్ళై, ప్రొఫెసర్ సీ.ఎస్ఆర్ రావు, డాక్టర్ తకాకి కజిట, డాక్టర్ మెఖేల్ డబ్ల్యూ యంగ్, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రముఖులు గీతం ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago