పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబరేటరీని మంగళవారం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి ప్రారంభించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను కూడా తిలకించారు . ఈ ప్రదర్శనలో బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ ) , ఆహారంలో కల్తీని కనుగొనే సాధనాలు , పలు పరిశోధనలకు ఉపకరించే పరికరాలను ప్రదర్శించారు . ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ బీఎంఐ పరీక్షలు నిర్వహించి , అప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించడం విశేషం .
ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పెబ్బిశెట్టి , పలువురు విద్యార్థులు పాల్గొన్నారు . ఫుడ్ సెన్స్డ్ , ప్యాకేజింగ్ , ఆవిష్కరణ రంగాలలో నెలకొని ఉన్న డిమాండ్ను తీర్చడానికి , కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి యువతలో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని 2020 లో గీతమ్లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఆరంభించినట్టు స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తెలియజేశారు . పరిశ్రమ , ఆస్పత్రులు , విమానయాన రంగాలలో ప్యాక్ చేసిన ఆహారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఔత్సాహిక యువత సొంత పరిశ్రమలు నెలకొల్పే యోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…