Telangana

గీతమ్ ఘనంగా ‘ ఇంజనీర్స్ డే ‘ , రక్తదాన శిబిరం….

మనవార్తలు ,పటాన్ చెరు:

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణంలో ‘ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ‘ గురువారం ఘనంగా నిర్వహించారు . హైదరాబాద్ లోని బీహెచ్ఎల్ డిప్యూటీ మేనేజర్ , ఫోరమ్ టు ఇంప్రూవ్ థింగ్స్ ( ఎఫ్ఎస్ఐటీ ) ప్రధాన కార్యదర్శి ఎం . భగత్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . సర్ విశ్వేశ్వరయ్య అసమాన సేవలను స్మరించుకోవడంతో పాటు , వర్ధమాన ఇంజనీర్లను ప్రోత్సహించడం , తద్వారా వారు ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు పేర్కొన్నారు . స్మార్ట్ క్లబ్ ప్రారంభం ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ( ఈఈసీఈ ) విభాగంలో ‘ జి – ఎలక్ట్రా ‘ పేరుతో స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ల్ను ప్రొఫెసర్ డీఎస్ రావు ప్రారంభించారు . ఆ క్లబ్ విద్యార్థులు ప్రదర్శించిన రెస్క్యూ రోబోట్ , బ్లెండెన్ విజన్ , స్మార్ట్ పార్కింగ్ , మూగ చెవిటి వారికి ఉపకరించే ‘ సహాయ్ – యంత్రిన్ ‘ , ఫ్యాను – బల్బులను రిమోట్ కంట్రోల్తో నియంత్రించే ‘ టెలిగ్రామ్ కంట్రోల్డ్ రూమ్ ‘ వంటి పలు మోడళ్ళను ఆయన సందర్శించి , వాటి పనితీరు గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు .

విద్యార్థులలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడం , ప్రజా జీవనాన్ని మరింత సుఖమయం చేసే పరికరాలు , వివిధ గాడ్జెట్ల ఆటోమేషన్పై సాంకేతిక అన్వేషణకు పురిగొల్పడం లక్ష్యంగా ఈ క్లబ్ు ఏర్పాటు చేసినట్టు ఈఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.మాధవి పేర్కొన్నారు . రక్తదాన శిబిరం ‘ ఇంజనీర్స్ డే’ని పురస్కరించుకుని చరెవైతి ( గీతం విద్యార్థి విభాగం ) భారత రెడ్ క్రాస్ సొసెట్టీతో కలిసి గురువారం రక్తదాన శిబిరాన్ని మంజీరా సెమినార్ హాల్లో నిర్వహించింది . తలసేమియాతో బాధపడుతున్న రోగులకు రక్తాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో దాదాపు 300 మంది ఔత్సాహిక విద్యార్థులు రక్తాన్ని దానం చేశారు . ఇలాంటి మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని , పెద్దసంఖ్యలో విద్యార్థులు ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు పిలుపు నిచ్చారు .

ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రెడ్ క్రాస్ సొసెట్రీ డాక్టర్ జనార్దనరెడ్డి , ఇతర సిబ్బంది , నిర్వహిస్తున్న చరెవేతి విద్యార్థి విభాగాన్ని ఆయన అభినందించారు . ఈ కార్యక్రమాలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , ప్రొఫెసర్ కె . మంజునాథాచారి , పలు విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు

admin

Recent Posts

శ్రీ సాయి చైతన్య హై స్కూల్‌లో వసంత పంచమి వేడుకలు

చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…

7 hours ago

ఈవీ చార్జింగ్ స్టేషన్ల ద్వారా యువతకు ఉపాధి పటాన్‌చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే పటాన్‌చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పర్యావరణ…

8 hours ago

బల్దియా అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల…

9 hours ago

స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా…

9 hours ago

ఐదు ఎకరాలలో డంపింగ్ యార్డ్ పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్, పటాన్‌చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చెత్త సమస్యకు శాశ్వత…

10 hours ago

మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన శివాలి

ఇప్పటివరకు 23 గిన్నిస్ రికార్డులతో పాటు 15 అసిస్ట్, 15 యూనిక్ వరల్డ్ రికార్డులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

10 hours ago