మనవార్తలు ,పటాన్ చెరు:
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకలలో భాగంగా , గీతం డీమ్డ్ విశ్వవిద్యాయలం , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించగా , జాతీయ గీతాలాపనతో పాటు ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ను నిర్వహించారు . ఈ సందర్భంగా శాస్త్రీయ , సమకాలీన నృత్య ప్రదర్శనలు , దేశభక్తి గేయాలను విద్యార్థులు ఆలపించారు .
ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎస్ రావు మాట్లాడుతూ , విద్యార్థులు మన స్వాతంత్ర్య స్ఫూర్తిని గ్రహించి , ప్రగతిశీల దేశం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు . వేడుకలలో పాల్గొన్న వారందరికీ ఆయన తన హృ దయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు . ఈ వేడుకలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ , పలువురు డీన్లు , డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది , ఉపసిబ్బంది తదితరులు పాల్గొన్నారు . అందరికీ మిఠాయి , ఫలహారాలు , తేనీరును పంపిణీ చేశారు .
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…