మనవార్తలు ,పటాన్ చెరు:
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకలలో భాగంగా , గీతం డీమ్డ్ విశ్వవిద్యాయలం , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించగా , జాతీయ గీతాలాపనతో పాటు ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ను నిర్వహించారు . ఈ సందర్భంగా శాస్త్రీయ , సమకాలీన నృత్య ప్రదర్శనలు , దేశభక్తి గేయాలను విద్యార్థులు ఆలపించారు .
ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎస్ రావు మాట్లాడుతూ , విద్యార్థులు మన స్వాతంత్ర్య స్ఫూర్తిని గ్రహించి , ప్రగతిశీల దేశం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు . వేడుకలలో పాల్గొన్న వారందరికీ ఆయన తన హృ దయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు . ఈ వేడుకలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ , పలువురు డీన్లు , డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది , ఉపసిబ్బంది తదితరులు పాల్గొన్నారు . అందరికీ మిఠాయి , ఫలహారాలు , తేనీరును పంపిణీ చేశారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…