పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అత్యుత్తమ విద్యకు చిరునామాగా మారిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘నాక్ ఏ++’ గ్రేడు (4 పాయింట్లకు గాను 3.54) సాధించి మరోసారి తన సత్తాను చాటుకుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ లేదా నాక్) గీతం పనితీరును విశ్లేషించి ‘ఏ++’ గ్రేడును కేటాయించిందని, ఇది ఏడేళ్ల పాటు అమలులో ఉంటుందని ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశంలోని దాదాపు 4,201 ఉన్నత విద్యా సంస్థలలో కేవలం మూడు శాతానికి మాత్రమే ఈ గ్రేడు దక్కినట్టు నాక్ వెబ్సైట్ ద్వారా వెల్లడవుతోందన్నారు.’నాక్ ఏ++’ గుర్తింపు పొందిన గీతం మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, ప్రపంచ స్థాయి, సమగ్ర విద్యను అందించడంతో పాటు సమాజానికి దోహదపడాలనే దాని లక్ష్యానికి కూడా దగ్గరయినట్టు ఉపకులపతి పేర్కొన్నారు. ఈ గ్రేడు సాధించడం ద్వారా మరింత స్వయం ప్రతిపత్తిని సమకూర్చే కేటగిరీ-1 హోదాను కూడా గీతం నిలుపుకుందన్నారు. అకడమిక్స్ ప్రోవీసీ ప్రొఫెసర్ జయశంకర్ ఇ వారియర్, ఐక్యూఏసీ డెరైక్టర్ ప్రొఫెసర్ రాజా ప్రభులతో సహా ఈ ఘనత సాధించిన సిబ్బంది, విద్యార్థులు, ఇతర భాగస్వాములందరికీ ప్రొఫెసర్ దయానంద అభినందనలు తెలియజేశారు.గతంలో, గీతం 2011లో ‘నాక్-ఏ’ గ్రేడు, 2017 ‘నాక్ – ఏ+’ గ్రేడు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…