మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ప్రమాణ -2 కే 23 సచివాలయాలన్ని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కరుణాకర్.బి . , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ సునీలక్కుమార్లు శుక్రవారం సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . గీతమ్లో ప్రతియేటా మూడు రోజుల పాటు సాంకేతిక – సాహిత్య – నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు . సాంకేతిక శిక్షణ , ఉపన్యాసాలు , పోటీలతో పాటు ర్యాంప్ వాక్ , సింఫోనీ , కన్సర్ట్ , బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ , కార్నివాల్ , పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది . ప్రమాణ కార్యాలయాన్ని ఆరంభించిన సందర్భంగా ప్రొఫెసర్ సీతారామయ్య మాట్లాడుతూ , నూతన సాంకేతికత మేళవింపుతో కార్యక్రమాలను ఎంపికచేసి , ఇతర కళాశాలల విద్యార్థులు విరివిగా పాల్గొనేలా వాటిని రూపొందించమని సూచించారు .
విశ్వస్థాయి ప్రమాణాలతో గీతం ప్రమాణ 2023 ని నిర్వహించాలని , జంట నగరాల చుట్టుపక్కల విద్యార్థులనే కాకుండా విశ్వవ్యాప్తంగా లేదా దేశ నలుమూలల ఉన్న సాంకేతిక కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ప్రొఫెసర్ కరుణాకర్ ఉద్బోధించారు . ప్రమాణ ద్వారా యాజమాన్య మెళకువలను నేర్చుకోవచ్చన్నారు . గత ఉత్సవాల కంటే ఈ ఏడాది ప్రమాణ -2 కే 23 మేటిగా ఉండేలా తీర్చిదిద్దమని ప్రమాణ నిర్వాహకులు డాక్టర్ పి.త్రినాథరావు , డాక్టర్ రూపాలత , స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్లు సూచించారు . వివిధ విభాగాధిపతులు , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ప్రమాణ -2323 కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు . గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఈ సందర్భంగా నివాళులర్పించారు .
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…