Telangana

ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్
అధ్యక్షులు చుక్క రాములు

-40 సంవత్సరాల పాటుగా ఒకే నాయకత్వంలో ఎవరికి సాధ్యం కానీ చారిత్రాత్మక విజయాలు

– కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం

– శాండ్విక్ 40 వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రతిరోజు శ్రమించే చేతులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈయు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పటాన్ చెరుపారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు అనుబంధంగా ఐక్యంగా ఓకే నాయకత్వంలో 40 సంవత్సరాలు(1985-2025) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 40 వ వార్షికోత్సవము కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మండలంలోని పోచారం గ్రామ పరిధిలో గల స్విచ్ స్పోర్ట్స్ స్టేషన్ మైదానం లో కార్మికులకు నిర్వహించిన వాలీబాల్ పోటీలకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పరిశ్రమలో 40 సంవత్సరాలపాటు ఒకే నాయకత్వంలో కార్మికులను ఐక్యంగా నిలబెట్టి ఇతరులకు సాధ్యం కాని అనేక అద్భుత విజయాలు సాధించడం అనేది చారిత్రాత్మకమన్నారు. కార్మిక సంక్షేమం కోసం రాజీలేని పోరాటం, పరిశ్రమలో నూతన కార్మికులు రావడానికి యూనియన్ నాయకత్వం ఎప్పటికప్పుడు తీసుకున్న ఎత్తుగడల ద్వారా మరియు పటిష్ఠమైన కారకర్తలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. కొందరు స్వార్ధపరులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా చైతన్యం గల శాండ్విక్ కార్మికులు వాటిని అధిగమిస్తున్నారని అన్నారు. 40 వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని స్వర్ణోత్సవాల వైపుకి మన ప్రయాణం సాగాలని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్.మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివరెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago