Telangana

ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్
అధ్యక్షులు చుక్క రాములు

-40 సంవత్సరాల పాటుగా ఒకే నాయకత్వంలో ఎవరికి సాధ్యం కానీ చారిత్రాత్మక విజయాలు

– కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం

– శాండ్విక్ 40 వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రతిరోజు శ్రమించే చేతులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈయు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పటాన్ చెరుపారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు అనుబంధంగా ఐక్యంగా ఓకే నాయకత్వంలో 40 సంవత్సరాలు(1985-2025) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 40 వ వార్షికోత్సవము కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మండలంలోని పోచారం గ్రామ పరిధిలో గల స్విచ్ స్పోర్ట్స్ స్టేషన్ మైదానం లో కార్మికులకు నిర్వహించిన వాలీబాల్ పోటీలకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పరిశ్రమలో 40 సంవత్సరాలపాటు ఒకే నాయకత్వంలో కార్మికులను ఐక్యంగా నిలబెట్టి ఇతరులకు సాధ్యం కాని అనేక అద్భుత విజయాలు సాధించడం అనేది చారిత్రాత్మకమన్నారు. కార్మిక సంక్షేమం కోసం రాజీలేని పోరాటం, పరిశ్రమలో నూతన కార్మికులు రావడానికి యూనియన్ నాయకత్వం ఎప్పటికప్పుడు తీసుకున్న ఎత్తుగడల ద్వారా మరియు పటిష్ఠమైన కారకర్తలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. కొందరు స్వార్ధపరులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా చైతన్యం గల శాండ్విక్ కార్మికులు వాటిని అధిగమిస్తున్నారని అన్నారు. 40 వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని స్వర్ణోత్సవాల వైపుకి మన ప్రయాణం సాగాలని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్.మనోహర్, ఎ. వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివరెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

11 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

11 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

11 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

23 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago