పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని నర్ర బస్తిలో గల హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమయ్యారు. పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ దేవాలయం ఆధీనంలో గల భూమిలో భవనాన్ని నిర్మించి, ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన ధూప దీప నైవేద్యాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. మున్నూరు కాపు సంఘం స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంగం సీనియర్ నాయకులు నాయికోటి రాజు, కాసాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ,…
సికింద్రాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ సికింద్రాబాద్ పరిధిలోని డైమండ్…
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హోప్ అఫ్ హంగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఆశయంతో…
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన వీరశైవ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్…