పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని నర్ర బస్తిలో గల హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమయ్యారు. పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ దేవాలయం ఆధీనంలో గల భూమిలో భవనాన్ని నిర్మించి, ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన ధూప దీప నైవేద్యాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. మున్నూరు కాపు సంఘం స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంగం సీనియర్ నాయకులు నాయికోటి రాజు, కాసాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…