Telangana

జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 3 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

_సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్ధశ

_ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ చేకూరిందని అన్నారు.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్షిప్ లో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్కే వన్ కాలనీలో రెండు కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పడక ముందు జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. గర్భిణీ స్త్రీ నుండి పండు ముదుసలి సరి వరకు ప్రతి ఒక్కరికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, దళిత బంధువు బీసీ బందు మైనార్టీ బందు పథకాల ద్వారా ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలగా.. పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెంప చెల్లుమనేలా ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

 

ఐనోలు గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ

పటాన్చెరు మండల పరిధిలోని ఐనోలు గ్రామ చౌరస్తాలో సొంత నిధులతో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గురువారం రాత్రి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాల్లోఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సర్పంచులు నరసింహ, పద్మా వెంకటేష్, ఎంపీటీసీ మానెమ్మ, ఉప సర్పంచ్ శివ గౌడ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, బండి శంకర్, శివారెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, దుర్గారెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

జూన్ 20న పదవ తరగతి ప్రతిభావంతులకు పురస్కారాల పంపిణీ

500 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇటీవల విడుదలైన…

20 minutes ago

ఇస్నాపూర్ మున్సిపాలిటీ కి ప్రత్యేక నిధులు కేటాయించండి : నీలం మధు ముదిరాజ్

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించండి మంత్రి వివేక్ కు  వినతి పత్రం ఇచ్చిన ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు మనవార్తలు ప్రతినిధి…

21 minutes ago

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

15 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన పటాన్‌చెరు ఎం ఎల్ ఎస్ పాయింట్ వే బ్రిడ్జి ప్రారంభం…

3 hours ago

గీతంలో ‘తల్లి పేరిట మొక్క’

మొక్కలు నాటిన గీతం ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశవ్యాప్త ‘తల్లి పేరిట ఒక…

4 hours ago

గీతంలో క్వాంటం సాంకేతికపై పరిశోధన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…

4 days ago

నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…

4 days ago