దేశంలోనే అత్యంత భారీ స్థాయిలో సూర్య దేవాలయం నిర్మాణం
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి
ఛట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఉత్తర భారతీయుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో పటాన్చెరు సాకి చెరువు కట్టపైన అత్యంత సుందరంగా, అన్ని సౌకర్యాలతో సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఉత్తర భారతీయులు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించే చట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడి దేవాలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు ప్రాంతం నిలుస్తోందని తెలిపారు.. నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతీయుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తగు ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారి అభివృద్ధికి అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, గూడెం విక్రం రెడ్డి, పృథ్వి రాజ్, శ్రీధర్ చారి, సందీప్ శా, కిషన్, సంజయ్ సింగ్, ఉత్తర భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…