Telangana

గంగా జమూన తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక మాజీ కోఆప్షన్ మెంబెర్ మొహమ్మద్ బషీర్ ఖురైషి

మనవార్తలు ప్రతినిధి , అమీన్‌పూర్ :

రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అమీన్‌పూర్ మాజీ కో ఆప్షన్ మెంబర్ బషీర్ ఖురైషి అన్నారు.రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కృష్ణారెడ్డి పెట్ ఈద్గాలో
ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో బషీర్ ఖురైషి పాల్గొన్నారు.ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ప్రార్ధనలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చి ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా బషీర్ అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో ప్రార్ధనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.రంజాన్ పండుగ లౌకికవాదానికి,మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయి’ బషీర్ ఖురేషి చెప్పారు.గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని,ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు_  ఐలాపూర్ మాణిక్ యాదవ్ 

రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి,సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సాయంత్రం నమాజ్‌ ఆచరించుకోవడానికి వెసులుబాటు కల్పించిందని అన్నారు.మసీదులు,ఈద్గాల అభివృద్ధికి,మరమ్మతులకు కెసిఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు దుస్తుల పంపిణీలతోపాటు ఇఫ్తార్‌ విందులు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
వారితోపాటు మాజీ ఉపసర్పంచ్ మొహమ్మద్ ఫహీం,, ఖమర్
అంజద్, మోయిన్, షేక్ సలీం, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago