మనవార్తలు,పటాన్ చెరు:
ఎంత కాలం నిలువ ఉంచినా గంగా జలం పాడవదని , అలాగే మనదేశంపై ఎందరో దాడులు చేసి భౌతిక సంపదను తరలించుకుపోయినా మన ధర్మం , పెద్దలు ఇచ్చిన జ్ఞానం ఇప్పటికీ నిలిచే ఉన్నాయని స్వామి పరిపూర్ణానంద సరస్వతి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని చరినైతి విద్యార్థి విభాగం అధ్వర్యంలో ‘ యువత పాత్ర , బాధ్యతలు ‘ అనే అంశంపై బుధవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . మనపై మనకే అవగాహన ఉంటే ఇతరులెవరిపెట్టా ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టీకరించారు . ముందుగా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని సరిగా అర్ధం చేసుకోవాలని , ధర్మం అంటే ఓ వ్యవస్థ అని , సమతౌల్యమని , సంతులనం చేసుకోవడమని అన్నారు . ఓ మనిషిగా , కొడుకుగా , విద్యార్థిగా లేదా ఉద్యోగిగా మన ధర్మం ఏమిటో ముందుగా గుర్తెరిగి , అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు .
ముందుగా మనకు నేర్చుకోవాలనే ఆకాంక్ష , ఆసక్తి ఉంటే ఈ సమాజం ఎంతో నేర్పుతుందన్నారు . ప్రకృతిని సరిగా అర్థం చేసుకుంటే అని మనకు సామరస్యాన్ని పంచుతుందని చెప్పారు . సమస్యలకు రాజీపడొద్దని , వాటిని అధిగమిస్తూ ఎదగడం నేర్చుకోవాలన్నారు . బుద్ధుడు దశావతారాల్లో ఒకరా అన్న ప్రశ్నకు బదులిస్తూ , సృష్టి పరిణామక్రమాన్ని వివరించారు . ఈ సృష్టిలో అంతా నీరేనని , భూమి కూడా నీళ్ళపెనే ఉందని , నీళ్ళలోనే తొలి జీవి పుట్టిందని , అదే తొలి మత్స్యావతారంగా ఆయన అభివర్ణించారు . ఆ తరువాత ఉభయచర జీవి ( భూమి – నీటిలో మనగలిగేది ) కూర్మావతారమని , భూమి మీదే మనగలిగిన వరాహ అవతారం , ఆ తరువాత సగం మనిషి – సగం జంతువు అని నారసింహావతారమని చెప్పారు . వామనావతారం పూర్తి మనిషే అయినా తగినంత పరిపక్వత లేదని , పరశురాముడి అవతారం ఒక గిరిజనుడి జీవన విధానాన్ని సూచిస్తుందని , ఆ తరువాత రాముడి అవతారం సమాజం , నియమాలు , విధానం , కలిసి మెలికి బతకడం వంటివి నేర్పించిందన్నారు .
బలరాముడి అవతారం కృషిని , కృష్ణుని అవతారం మాయ , మర్మం , ఏది చేయాలో , ఏది చేయకూడదో తెలియజేసిందని చెప్పారు . కృష్ణుడు బోధించిన భగవద్గీతను అర్థం చేసుకుంటే జీవితాన్నే తెలుసుకోవచ్చన్నారు . మనిషిలో పెరుగుతున్న స్వార్థమే కల్కి అవతారమని , కోవిడ్ మహమ్మారి తన , పర భేదం లేకుండా మనిషిలో ఉన్న స్వార్థాన్ని బట్టబయలు చేసిందని చెప్పారు . బుద్ధుడు గురువు అయినా దేవుడిగా చూడాలని మన పెద్దలు బోధించారన్నారు . ప్రతి సంప్రదాయం వెనుక ఓ శాస్త్రం ఉంటుందని , ఒక దీపం లక్షల దీపాలను వెలిగించగలదు కాని , ఒక విద్యుత్ దీపం మరో దీపాన్ని వెలిగించలేదని స్వామి పరిపూర్ణానంద చెప్పారు . దీపం మాదిరి మనం కూడా నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని సూచించారు .
ఎప్పుడైనా కొంత ఖాళీ సమయం దొరికితే , ముందుగా మనని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు . తాను వ్యక్తిగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓ వ్యవస్థగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు . ముందుగా జ్ఞానాన్ని సమకూర్చుకోవాలని , ఎంత క్లిష్టమైన పనినైనా కొంచెం ఆలోచించి చేస్తే విజయవంతం కాగలనున్నారు . గెలవాలనే సంకల్పం బలంగా ఉంటే , దానిని ఎవరూ అడ్డుకోలేరని , మహా అయితే కొంచెం ఆలస్యం కావచ్చని , కానీ విఫలం కామని స్వామి పరిపూర్ణానంద స్పష్టీకరించారు . ఓ తొలుత గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీని రామారావు తదితరులు స్వామీజీ సత్కరించారు .
27 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని వచ్చే…
గీతం ఫెస్ట్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మనం ఏ ప్రాంతం,…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్రో మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కృత్రిమ మేధస్సు…
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…