Telangana

మత్స్యకారుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం నీలం మధు ముదిరాజ్

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సంప్రదాయ మత్స్యకారుల మహాసభ

నీలం మధుకు ప్రతి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికిన మత్స్యకారులు

పెద్దకొత్తపల్లి చౌరస్తా నుండి సభా ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని కొల్లాపూర్ నియోజక వర్గం కొల్లాపూర్ పట్టణం ఎస్ ఎమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సాంప్రదాయ మత్స్యకారుల 8వ మహాసభలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పగిడీల శ్రీనివాస్ గారితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దకొత్తపల్లి చౌరస్తా నుండి సభా ప్రాంగణం వరకు డప్పు చప్పులతో, భారీ ర్యాలీతో నీలం మధు కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ నీలి విప్లవంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న తలంపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు గానే చూసిన మత్స్యకారులను రేవంత్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు. ఆ దిశగానే చెరువుల సంరక్షణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగనణతో ముదిరాజులకు రాజకీయంగా అవకాశాలు పెరగడంతో చట్టసభల్లో మన వానిని వినిపించే అవకాశం లభించనుందన్నారు. ఇప్పటికే ముదిరాజులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని త్వరలో మన సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మన జాతిని గౌరవించి జాతి అభ్యున్నతి కోసం సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముదిరాజ్ సోదరులంతా స్థానిక ఎన్నికల్లో సహకరించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వాకిటి ఆంజనేయులు, రజని,మల్లికార్జున్, కొల్లాపూర్ మత్స్యశాఖ వైస్ చైర్మన్ సొప్పరి మల్లయ్య,సోపరి వెంకటస్వామి ,నాగరాజు,మాజీ వైస్ ఎంపీపీ వెంకటస్వామి,మల్లయ్య, మత్స్యశాఖ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago