పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం- 2024 (ఈనెల 25న) పురస్కరించుకుని ఫార్మసీ విద్యార్థుల కోసం. ఆకర్షణీయమైన పోటీలను నిర్వహించాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ సంకల్పించింది. ఈ పోటీలలో వ్యాస రచన, పోస్టర్ ప్రదర్శన, మౌఖిక ప్రదర్శన, క్విజ్ వంటివి ఉంటాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఫార్మసిస్టులు కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని (ప్రస్పుటం చేసే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఫార్మసీ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని డాక్టర్ శివకుమార్ తెలియజేశారు. వ్యాస రచన పోటీలలో పాల్గొనేవారు ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర, టెలిఫార్మసీ వంటి అంశాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. సురక్షితమైన ఔషధ వినియోగ పద్ధతులు, గ్రామీణ ఆరోగ్యంలో అంతరాన్ని తగ్గించడం, మానసిక ఆరోగ్యానికి ప్రపంచ సహకారం వంటి విషయాలపై పోస్టర్ ప్రదర్శనను రూపొందించవచ్చని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య విధానం, ఇతర సంబంధిత రంగాలలో ఫార్మసిస్టుల నాయకత్వంపై మౌఖిక ప్రదర్శన చేయొచ్చన్నారు, ముగ్గురు లేదా నలుగురు జట్టుగా (విడివిడిగా పేర్లు. నమోదు చేసుకోవాలి) గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ప్రత్యక్షంగా నిర్వహించే క్విజ్ పోటీలలో పాల్గొనాలని చెప్పాడు.ఆసక్తి గల ఫార్మసీ విద్యార్థులు తను ఎంట్రీలను gpsa_hyd@gitam.in ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలని, విజేతలకు ఉత్తేజకర బహుమతులు, అవార్డులను ప్రదానం చేస్తామని ప్రొఫెసర్ శివకుమార్ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థి సమన్వయకర్తలను (7330 778 199 లేదా 89777 14744) సంప్రదించాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…