Telangana

ఆలయ నిర్మాణాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి_ బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆధ్యాత్మిక వాతావరణంలో పల్లెలు ,పట్టణాలు అభివృద్ధి చెంది సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుంచు రేణుక స్వామి,ఎంపీటీసీ పార్వతమ్మ,ఉప సర్పంచ్ తీగల సత్తయ్య, అశోక్, శివకుమార్, కనకరాజు,భాస్కర్ ,శ్రీకాంత్, సంతోష్,శేఖర్, గ్రామ పెద్దలు, ప్రజలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సైతం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్ ఆలయాల అభివృద్ధి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago