మనవార్తలు ,పటాన్చెరు:
ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. చిట్కుల్ గ్రామ పరిధిలోబడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని విద్యార్థులతో కలిసి అవగాహనా ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని. తెరాస ప్రభుత్వం బలోపేతం చేస్తూ ఆంగ్ల విద్యను సైతం ఈ ఏడాది నుంచి అందిస్తుందని ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలని ఆయన తెలిపారు .ప్రతి ఒక్క తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…