Telangana

గణితం లేకుండా గణాంకాలు లేవు : డాక్టర్ కేవీఎస్

– గీతమ్ ఘనంగా ‘ జాతీయ గణాంకాల దినోత్సవం ‘

మనవార్తలు ,పఠాన్ చెరు:

గణితం లేకుండా గణాంకాలు ఉండవని , గణాంకాల పరిజ్ఞానం ముఖ్యమని , అయితే ఉపాధికి నెపుణ్యాలు ఎంతో అవసరమని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్ శర్మ అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్ నిర్వహించిన ‘ జాతీయ గణాంకాల దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . గణాంకాలు మనదేశంలో పాదుకొని , పురోభివృద్ధి చెందడానికి ఎంతో కృషిచేసిన ప్రొఫెసర్ పీసీ మహలోబిస్ సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు . రోజువారీ జీవితంలో గణాంకాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఆయన జయంతిని ‘ జాతీయ గణాంకాల దినోత్సవం’గా జరుపుకుంటున్నట్టు వివరించారు .

ఈ సందర్భంగా సర్ రోనాల్డ్ ఎ ఫిషర్ , సీఆర్ రావు , వాల్టర్ ఎ.పెనార్డ్ సేవలను కూడా ఆయన స్మరించుకున్నారు . నిర్ణయం తీసుకోవడం జీవితంలో ఒక భాగమని , దానికి గణాంకాలు ఎంతగా ఉపకరిస్తాయో ఆయన విడమరిచి చెప్పారు . అంతేగాక , పెట్టుబడి నిర్ణయాలు , మార్కెట్ విశ్లేషణ , కొత్త ఉత్పత్తి అభివృద్ధి , వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం , వ్యాపార ప్రకటనల పరిశోధన , ఆర్థిక లావాదేవీల భద్రత , మానవవనరుల ప్రణాళిక కోసం వ్యాపార రంగంలో గణాంకాలను వినియోగిస్తారని ప్రొఫెసర్ కేవీఎస్ పేర్కొన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కేఎన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమం , సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి వందన సమర్పణతో ముగిసింది . గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా , ప్రొఫెసర్ బి.ఎం. నాయుడు , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago